భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా ‘పుష్ప’ ఆడియోకు 500 కోట్ల వ్యూస్

Pushpa Album creates history with 500 crore views
  • ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప'  
  • హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న 
  • త్వరలోనే సెట్స్ మీదకు  రెండో భాగం
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయం సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌ సహా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది.
 
 ఇక ఈ సినిమాలోని పాటలు ఏ స్థాయిలో పాప్యులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో, బాక్సాఫీస్‌ విజయంతోనే ఈ సినిమా చరిత్ర ఆగిపోలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలోని మ్యాజిక్‌ ఆల్బమ్‌ కొత్త రికార్డు సాధించింది. 
 
దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్‌ బిడ్డా పాటలు అభిమానులను ఉర్రూతలగించాయి. దాంతో, ఈ సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. భారత దేశంలో మరే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు ఈ స్థాయి వ్యూస్ రాలేదు. దాంతో, పుష్ప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలోనే ‘పుష్ప 2’ సెట్స్‌ మీదకు వెళ్లనుంది.
Go Back to Shorts
Allu Arjun
Pushpa
Rashmika Mandanna
sukumar
audio
album
500 cr
views

More Telugu News