భారీ వర్షాలకు ముంబయి మహానగరం అతలాకుతలం
- నిన్నటి నుంచి ముంబయిలో జోరువాన
- పలు ప్రాంతాలు జలమయం
- పరిస్థితి సమీక్షించిన సీఎం ఏక్ నాథ్ షిండే
- 3,500 మందిని తరలించిన అధికారులు
ఈ నేపథ్యంలో, 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. నగరంలో వర్షాల పరిస్థితిని షిండే సమీక్షించారు. బీఎంసీ పరిధిలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించారు. భారీగా నీరు నిలిచిపోవడంతో ఖార్, అంధేరీ సబ్ వేలు మూసివేశారు. శాంతాక్రజ్, మంఖుర్ద్ రైల్వే స్టేషన్ల వద్ద రైళ్లరాకపోకలు నిదానించాయి.