శివసేన రెబెల్స్ నుంచి నాకూ ఆహ్వానం అందింది: సంజయ్ రౌత్
- గౌహతి నుంచి ఆహ్వానం అందిందన్న సంజయ్ రౌత్
- బాలా సాహెబ్ అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పానన్న ఎంపీ
- బాధ్యత కలిగిన పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యానని వెల్లడి
తాజాగా శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన సంజయ్ రౌత్... ఏక్నాథ్ షిండే నుంచి తనకు కూడా ఆహ్వానం అందిందని వెల్లడించారు. గౌహతిలో ఉన్న సందర్భంగా షిండే వర్గం నుంచి తనకు ఆహ్వానం అందిందన్న రౌత్... తాను మాత్రం బాలా సాహెబ్ అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ కారణంగానే తాను షిండే వర్గం ఆహ్వానాన్ని తిరస్కరించానని ఆయన వెల్లడించారు. ఇక శుక్రవారం జరిగిన తన ఈడీ విచారణపైనా ఆయన స్పందించారు. ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేస్తే విచారణకు హాజరయ్యానని ఆయన తెలిపారు. అవసరమనుకుంటే మరోమారు అయినా విచారణకు వస్తానని ఈడీ అధికారులకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.