ఏపీ హైకోర్టుకు క్షమాపణ చెప్పిన కోనసీమ అల్లర్ల పిటిషనర్... రూ.50 లక్షల జరిమానాను తప్పించుకున్న వైనం
కోనసీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి జిల్లా కేంద్రం అమలాపురంలో చోటుచేసుకున్న అల్లర్లపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు... పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ విద్వేషాలను రెచ్చగొట్టేదిగానే ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా ఈ తరహా పిటిషన్లు మంచిది కాదని కూడా హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ను బాధ్యతారహితమైనదిగా పరిగణిస్తూ రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని కోర్టు పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలతో భీతిల్లిన పిటిషనర్...బేషరతుగా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. దీంతో ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
అంతేకాకుండా ఈ తరహా పిటిషన్లు మంచిది కాదని కూడా హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ను బాధ్యతారహితమైనదిగా పరిగణిస్తూ రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని కోర్టు పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలతో భీతిల్లిన పిటిషనర్...బేషరతుగా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. దీంతో ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.