కుతంత్రాలతో నా పల్నాడు పర్యటనని పోలీసులు అడ్డుకోవాలనుకున్నారు: నారా లోకేశ్
- జల్లయ్య కుటుంబానికి పరామర్శ కోసం పల్నాడుకు లోకేశ్
- దారి పొడవునా లోకేశ్కు పార్టీ శ్రేణుల స్వాగతం
- ప్రజాభిమానం చూసి పోలీసులు వెనక్కు తగ్గారన్న లోకేశ్
కుతంత్రాలతో తన పల్నాడు పర్యటనని పోలీసులు అడ్డుకోవాలనుకున్నారంటూ ఆ ట్వీట్లలో లోకేశ్ ఆరోపించారు. అయితే అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి పోలీసులు వెనక్కితగ్గారని ఆయన చెప్పారు. పిడుగురాళ్ల పట్టణంలో యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనకు ఘనస్వాగతం లభించిందని తెలిపారు. దారి పొడవునా నేతలు, కార్యకర్తలు తనపై కురిపించిన అభిమానం ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ లోకేశ్ పేర్కొన్నారు.