Sensex: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయి 52,693కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (1.63%), ఎన్టీపీసీ (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.19%), ఇన్ఫోసిస్ (1.13%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.12%), టెక్ మహీంద్రా (-2.08%), రిలయన్స్ (-1.33%), మారుతి (-1.32%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News