Sensex: ట్రేడింగ్ చివర్లో కుప్పకూలిన మార్కెట్లు

  • 703 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 215 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఐదున్నర శాతం నష్టపోయిన హెచ్డీఎఫ్సీ షేర్ విలువ
Markets ends in loses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప నష్టాలు, లాభాల్లో కొనసాగుతూ వచ్చాయి. అయితే ట్రేడింగ్ చివరి అరగంటలో ఒక్కసారిగా కుప్పకూలాయి. 

ఐటీ, ఫైనాన్సియల్, కన్జ్యూమర్ గూడ్స్ స్టాకులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బలహీనంగా వస్తున్న కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మదుపరులపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి 56,463కి పడిపోయింది. నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 16,958కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.71%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.44%), బజాజ్ ఫైనాన్స్ (0.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.16%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ (-5.50%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.73%), ఇన్ఫోసిస్ (-3.55%), ఐటీసీ (-3.33%), టెక్ మహీంద్రా (-3.17%).

More Telugu News