Sensex: మార్కెట్లలో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

Markets ends in profits
  • చివరి రెండు గంటల్లో లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు
  • 581 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. చివరి రెండు గంటల్లో మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఫార్మా స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 53,424కి పెరిగింది. నిఫ్టీ 150 పాయింట్లు ఎగబాకి 16,013 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.99%), టీసీఎస్ (3.29%), ఎన్టీపీసీ (2.77%), విప్రో (2.73%), టెక్ మహ్రీంద్రా (2.69%). 

టాప్ లూజర్స్:
టాట్ స్టీల్ (-1.73%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.49%), టైటాన్ (-0.32%), నెస్లే ఇండియా (-0.25%), రిలయన్స్ (-0.15%).
Sensex
Nifty
Stock Market

More Telugu News