కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు నారా లోకేశ్ లేఖ

Nara Lokesh wrote Nirmala Sitharaman
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. కరోనా మహమ్మారి ప్రభావంతో చేనేత పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించారు. చేనేత పరిశ్రమను తిరిగి గాడినపెట్టేందుకు కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూడడం వల్ల చేనేత పరిశ్రమ కుదేలైందని ఆయన ఆరోపించారు. 
Go Back to Shorts
Nara Lokesh
Nirmala Sitharaman
Handloom
Andhra Pradesh

More Telugu News