ముచ్చింతల్ లో ముగిసిన రామానుజ సహస్రాబ్ది వేడుకలు
- గత 12 రోజులుగా సహస్రాబ్ది వేడుకలు
- స్వర్ణమూర్తికి ప్రాణప్రతిష్ట చేసిన చిన్నజీయర్
- శాంతి కల్యాణం వాయిదా
- ఈ నెల 19న శాంతికల్యాణం
- చారిత్రాత్మక రీతిలో ఉంటుందన్న చిన్నజీయర్
ఇక సహస్రాబ్ది వేడుకల ఆఖరి రోజున 5 వేల మంది రుత్విక్కులతో లక్ష్మీనారాయణ మహాయాగం నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి 1,035 పాలికల్లోని సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి పసిడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు.
ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామనగరంలో గత 12 రోజులుగా చేపట్టిన సహస్రాబ్ది వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై తరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తయిన సమతామూర్తి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.