Sensex: వరుసగా మూడో రోజు నష్టపోయిన మార్కెట్లు

Markets ends in losses for 3rd straight day
  • 372 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 133 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • మూడున్నర శాతం నష్టపోయిన ఎం అండ్ ఎం షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఈ ఉదయం నుంచి కూడా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్యే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 59,636కి పడిపోయింది. నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 17,764కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.37%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.16%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.54%), టెక్ మహీంద్రా (-3.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.01%), ఎల్ అండ్ టీ (-2.93%), టాటా స్టీల్ (-2.62%).

More Telugu News

Sensex
Nifty
Stock Market