అద్వానీని కలిసి విషెస్ చెప్పిన ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి
- నేడు అద్వానీ పుట్టిన రోజు
- శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చిన ప్రముఖులు
- 1927లో కరాచీలో జన్మించిన అద్వానీ
మరోవైపు మోదీ ట్విట్టర్ ద్వారా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరచడంలో, మన సంస్కృతిని విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన మేధో సంపత్తి ఎంతో గర్వించదగినది' అని మోదీ పేర్కొన్నారు.
1927లో ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో అద్వానీ జన్మించారు. స్వాతంత్ర్యం సందర్భంగా దేశం విడిపోయినప్పుడు ఆయన కుటుంబం కరాచీ నుంచి భారత్ కు తరలి వచ్చింది. మన దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అద్వానీ చేసిన కృషి వెలకట్టలేనిది.