Sensex: వరుస నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

Markets ends in profits
  • 166 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 42 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్లు లాభపడటంతో మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 52,485కి చేరుకుంది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 15,722 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (1.53%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.50%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.99%), టైటాన్ కంపెనీ (0.84%), యాక్సిస్ బ్యాంక్ (0.55%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.23%), బజాజ్ ఆటో (-0.75%), ఏసియన్ పెయింట్స్ (-0.62%), సన్ ఫార్మా (-0.58%).
Sensex
Nifty
Stock Market

More Telugu News