మాతృ దినోత్సవం వేళ సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా సైకత శిల్పం
- కరోనా జాగ్రత్తలు గుర్తు చేస్తూ సైకత శిల్పం
- చూపరులను ఆకట్టుకుంటోన్న సుదర్శన్ ప్రతిభ
- హ్యాపీ మదర్స్ డే అంటూ రూపొందించిన పట్నాయక్
మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలతో పాటు పిల్లల పట్ల తల్లి తీసుకునే జాగ్రత్తలను ఈ సైకత శిల్పం ద్వారా ఆయన చూపించారు. కరోనా వేళ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన రూపొందించిన ఈ సైకత శిల్పం అద్భుతంగా ఉందంటూ పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.