Corona Virus: దేశంలో మ‌రో 3.86 ల‌క్ష‌ల మందికి కరోనా నిర్ధారణ

India reports 386452 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976
  • నిన్న‌ 3,498 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,08,330  
  • 15,22,45,179 మందికి వ్యాక్సిన్లు  
భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న‌ కొత్త‌గా 3,86,452 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,97,540 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,498 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,08,330కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,53,84,418 మంది కోలుకున్నారు. 31,70,228 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,22,45,179 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  28,63,92,086 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,20,107 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  
 
Corona Virus
COVID19
India

More Telugu News