Nara Lokesh: ధూళిపాళ్ల నరేంద్ర భార్యను ఫోన్ ద్వారా పరామర్శించిన నారా లోకేశ్

  • ఈ ఉదయం నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
  • పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారన్న నరేంద్ర భార్య
  • జగన్ కు, పోలీసు అధికారులకు కోర్టులో చీవాట్లు తప్పవన్న లోకేశ్
Nara Lokesh speaks to Dhulipala Narendra wife

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ ఛైర్మన్ గా నరేంద్ర ఉన్నారు. ఆ సంస్థలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని, తమ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర భార్య జ్యోతిర్మయిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ ద్వారా పరామర్శించారు.

కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణాన్ని సృష్టించారని ఈ సందర్భంగా లోకేశ్ కు జ్యోతిర్మయి తెలిపారు. విచారణకు తాము సిద్ధమని, అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినా వినకుండా భయోత్పాతం సృష్టించారని చెప్పారు.

ఈ సందర్భంగా జ్యోతిర్మయిని లోకేశ్ ఓదార్చారు. ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నరేంద్రపై పెట్టిన అక్రమ కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ యూనిఫామ్ వేసుకున్న పోలీసు అధికారులకు కోర్టులో చీవాట్లు తప్పవని అన్నారు.

  • Loading...

More Telugu News