Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in flat mode
  • మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావం
  • సెన్సెక్స్ కు 28 పాయింట్ల లాభం 
  • 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ... కరోనా ప్రభావంతో మన మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 48,832కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 14,618 వద్ద స్థిరపడింది. హెల్త్ కేర్ సూచీ 1.88 శాతం పెరిగింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.07%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.43%), ఓఎన్జీసీ (2.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.10%), సన్ ఫార్మా (2.07%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.55%), ఎల్ అండ్ టీ (-1.09%), బజాజ్ ఫైనాన్స్ (-0.94%), టీసీఎస్ (-0.80%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%).
Sensex
Nifty
Stock Market

More Telugu News