రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్తో కేంద్రం ఒప్పందం!
- కేంద్రమంత్రి తోమర్ ఆధ్వర్యంలో సంతకాలు
- పెట్టుబడి వ్యయం తగ్గించడమే వ్యూహం
- 6 రాష్ట్రాల్లోని 100 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు
- కొవిడ్ సంక్షోభంలోనూ రాణించిన వ్యవసాయ రంగం
ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ... సాగుకు సాంకేతికతను జోడించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చని, యువతను వ్యవసాయం దిశగా మళ్లించవచ్చని తెలిపారు. కేంద్రం ఏటా రూ.6 వేలు రైతుల ఖాతాలో జమచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తోమర్ గుర్తుచేశారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ వ్యవసాయ రంగం రాణించిందని తెలిపారు.