నాకు కరోనా పాజిటివ్... టేకాఫ్ కు కొద్దిముందుగా చెప్పిన విమాన ప్రయాణికుడు
- ఢిల్లీ నుంచి పూణే వెళుతున్న విమానం
- టేకాఫ్ తీసుకుంటుండగా ఘటన
- తనకు కరోనా సోకిందని సిబ్బందికి చెప్పిన వ్యక్తి
- మెడికల్ రిపోర్టులు చూపించిన వైనం
- టేకాఫ్ విరమించుకున్న పైలెట్
ప్రయాణికుల్లోంచి ఓ వ్యక్తి లేచి తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా చూపించాడు. ఈ నేపథ్యంలో, విమాన పైలెట్ ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు నివేదించాడు. వారి సూచనల మేరకు విమానాన్ని కిందికి దించాడు. ఆ కరోనా రోగిని ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రయాణికుడు కూర్చున్న సీటుతో పాటు ఇతర సీట్లను కూడా శుద్ధి చేసిన తర్వాతే ఆ విమానం పూణే వెళ్లనుంది. ప్రయాణికులందరికీ పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు.