Sensex: మార్కెట్లకు ఈ రోజూ లాభాలే.. తొలిసారి 50 వేల పాయింట్లకు పైన ముగిసిన సెన్సెక్స్

Sensex closes above 50000 points for the first time
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర బడ్జెట్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 50 వేల పాయింట్లకు ఎగువన ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 458 పాయింట్లు లాభపడి 50,256కి చేరుకుంది. నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 14,790 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.65%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.28%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (3.71%), సన్ ఫార్మా (3.29%), ఎన్టీపీసీ (3.13%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-0.90%), మారుతి సుజుకి (-0.89%), ఐటీసీ (-0.66%), కోటక్ మహీంద్రా (-0.63%), ఏసియన్ పెయింట్స్ (-0.42%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News