Sensex: ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex closes 589 points low
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 589 పాయింట్లు నష్టపోయి 46,285కి పడిపోయింది. నిఫ్టీ 182 పాయింట్లు కోల్పోయి 13,634 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.44%), సన్ ఫార్మా (3.91%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.68%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.50%).

టాప్ లూజర్స్:    
డాక్టర్ రెడ్డీస్ (-5.69%), మారుతి సుజుకి (-4.99%), భారతి ఎయిర్ టెల్ (-3.12%), బజాజ్ ఆటో (-3.02%), ఇన్ఫోసిస్ (-2.87%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News