బైడెన్ కు తొలి ఎదురు దెబ్బ... డిపోర్టేషన్ ఆదేశాలపై న్యాయమూర్తి స్టే!
- వలస దారులకు న్యాయం చేస్తానని ఎన్నికలకు ముందే హామీ
- డిపోర్టేషన్ ను 100 రోజులు వాయిదా వేస్తూ ఉత్తర్వులు
- స్టే విధించిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి
డిపోర్టేషన్లను పూర్తిగా నిలిపివేస్తే, అది ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని ఈ సందర్భంగా పాక్ స్టన్ వ్యాఖ్యానించారు. కాగా, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజున.. ఏ విధమైన పత్రాలూ లేకుండా యూఎస్ లో నివాసం ఉంటున్న వారిని వెనక్కు పంపే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ, మారటోరియంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 1, 2020కన్నా ముందుగా అమెరికాలో ఉంటున్న వారికే ఈ అవకాశం లభిస్తుంది.
కాగా, వైట్ హౌస్ నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడగానే, ట్రంప్ కు సన్నిహితుడిగా ముద్రపడిన పాక్స్ టన్ వెంటనే కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాలు దేశ పౌరుల ప్రయోజనాలను కాపాడటంలో ముందుంటాయనే తాను భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇమిగ్రెంట్ల విషయంలో న్యాయ పోరాటం ఇప్పుడే మొదలైందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.