కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తమిళనాడు రాష్ట్ర మంత్రి
- కొవాగ్జిన్ వేయించుకున్న డాక్టర్ సి.విజయభాస్కర్
- ఓ వైద్యుడిగా, ఐఎంఏ సభ్యుడిగా వేయించుకుంటున్నట్లు ట్వీట్
- వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచన
అంతకు ముందు విజయభాస్కర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై ట్వీట్ చేశారు. 'ఈ రోజు ఉదయం 9 గంటలకు నేను కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. ఓ వైద్యుడిగా, ఐఎంఏ సభ్యుడిగా నేను ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. ఆరోగ్య కార్యకర్తల్లో కరోనా వ్యాక్సిన్పై నమ్మకాన్ని నింపడానికే ఈ పని చేస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని అందరినీ కోరుతున్నాను' అని ఆయన పేర్కొన్నారు.