మోదీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్
- కరోనా వ్యాక్సిన్ పై చాలా మందిలో అపోహలు ఉన్నాయి
- సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది
- వ్యాక్సిన్ తీసుకోవడానికి నేను సిద్దం
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతూ మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టనున్నట్టు చెప్పారు. షహీన్ బాగ్ ఆందోళనల సమయంలో సిక్కులు మద్దతు పలికారని... ఇప్పుడు రైతుల ఆందోళనలకు ముస్లింలు అండగా ఉంటారని తెలిపారు. రైతులకు అండగా నిలవడంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ఆందోళనల్లో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కనిపించారని... ఆయన పార్టీ మాత్రం ఎక్కడా కనిపించలేదని దుయ్యబట్టారు.