ఉదయం 11 గంటలకు గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ
- ఎన్నికల కార్యాచరణ గురించి గవర్నర్కు వివరించనున్న నిమ్మగడ్డ
- ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే కోర్టులో అఫిడవిట్
- ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని గవర్నర్కు ఇప్పటికే స్పష్టం చేసిన జగన్?
మరోవైపు, దీపావళి ముందు రోజు గవర్నర్తో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఈసీ ఇప్పటికే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.