Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sensex ends 448 points high
  • 448 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 111 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • భారీగా లాభపడ్డ బ్యాంకింగ్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తుందనే అంచనాలతో పాటు, కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనే ఆశాజనక పరిణామాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 448 పాయింట్లు లాభపడి 40,432కి చేరుకుంది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 11,873 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్, పీఎస్యూ, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మంచి లాభాలను నమోదు చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (5.00%), నెస్లే ఇండియా (4.70%), యాక్సిస్ బ్యాంక్ (4.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.09%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.78%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-1.86%), టీసీఎస్ (-1.76%), భారతి ఎయిర్ టెల్ (-1.38%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.20%), మారుతి సుజుకి (-0.70%).
Sensex
Nifty
Stock Market

More Telugu News