రాష్ట్రంలో మార్పుకు దుబ్బాక ఎన్నికలతో శ్రీకారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- దుబ్బాక ఉప ఎన్నికల నామినేషన్ పర్వం
- కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్
- భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు
ఉత్సాహం ఉరకలెత్తుతోంది: కోమటిరెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం 1,100 మంది పిల్లలు ఆత్మత్యాగాలు చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు.
దుబ్బాకలో శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని, ఈ ఉత్సాహమే కాంగ్రెస్ విజయానికి ఢోకా లేదనే సంకేతాలు ఇస్తోందని తెలిపారు. ముత్యం వంటి మనిషి చెరుకు ముత్యంరెడ్డి వారసత్వాన్ని నిలబెట్టేందుకు దుబ్బాకలో ఈసారి ప్రజలు కాంగ్రెస్ కు పట్టంకట్టడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.