Sensex: కొనుగోళ్ల వెల్లువతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex closes points high
  • 519 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 160 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6.68 శాతం పెరిగిన ఎల్ అండ్ టీ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. అన్ని సూచీల్లో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 519 పాయింట్లు లాభపడి 35,430కి పెరిగింది. నిఫ్టీ 160 పాయింట్లు పుంజుకుని 10,471కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (6.68%), బజాజ్ ఫైనాన్స్ (6.54%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (6.29%), ఎన్టీపీసీ (5.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (5.06%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.55%), భారతి ఎయిర్ టెల్ (-0.36%), మారుతి సుజుకి (-0.20%).
Sensex
nifty
Stock Market

More Telugu News