దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
- కొన్నినెలలుగా దేశంలో లాక్ డౌన్
- మార్చిలోనే మూతపడిన విద్యాసంస్థలు
- ఇప్పట్లో తెరవొద్దంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 15 తర్వాతే పునఃప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ లోపు అన్ని వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా, ఏపీలో స్కూళ్లను ఆగస్టు 3న తెరవాలని సర్కారు నిర్ణయించింది.