గర్భవతులపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే...!
- అత్యధికుల్లో న్యూమోనియా గుర్తింపు
- నెలలు నిండకుండానే ప్రసవాలు
- 50 శాతం మంది గర్భవతుల్లో లక్షణాలు లేకుండానే కరోనా నిర్ధారణ
కాగా ఈ 441 కేసుల్లో 9 మంది గర్భవతులు మరణించగా, నలుగురు శిశువులు ప్రసవానంతరం చనిపోయారు. ఆరు కేసుల్లో శిశువులు తల్లిగర్భంలోనే మృతి చెందారు. ఆయా దేశాల్లో గర్భవతులు కరోనా బారిన పడిన తర్వాత 56 శాతం మంది జ్వరం, 43 శాతం మంది దగ్గు, 19 శాతం మంది కండరాల నొప్పులు, 18 శాతం మంది శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కరోనా పాజిటివ్ గర్భవతుల్లో 10 శాతం మంది హైపర్ టెన్షన్, 9 శాతం మంది గర్భంతో వచ్చే మధుమేహంతోనూ బాధపడుతున్నట్టు వెల్లడైంది.
ముఖ్యంగా, లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ రావడం గర్భవతుల్లోనూ కనిపించిందని అధ్యయనంలో పేర్కొన్నారు. సుమారు 50 శాతం మంది గర్భవతుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా నిర్ధారణ అయిందట.