పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కు కరోనా... ప్రధాని ఇమ్రాన్ కు కరోనా పరీక్షలు!
- రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ను కలిసిన అసద్
- తాజా పరీక్షల్లో అసద్ కు పాజిటివ్
- ఇమ్రాన్ కు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
ఇక ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల రిపోర్టు వెల్లడికావాల్సి వుంది. గతంలోనూ ఓ మారు ఇమ్రాన్ కు పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనకు వైరస్ నెగటివ్ వచ్చింది. తాజా సమాచారం మేరకు పాక్ లో 16,353 మంది కరోనా బాధితులు ఉన్నారు. లాక్ డౌన్ ను అమలు చేస్తూ, రంజాన్ మాసాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలని, ప్రార్థనల పేరిట ఎవరూ బయటకు రావద్దని అధికారులు చెబుతున్నా, కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన వారిలో నెలకొనివుంది.