బాలీవుడ్ లో మరో కలకలం.. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్ర నిర్మాత కూతురికి కరోనా పాజిటివ్!
- నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్
- లాక్ డౌన్ కు ముందు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన షాజా
- ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స
ప్రస్తుతం షాజా పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుందని కుటుంబసభ్యులు తెలిపారు. షాజా మోరానీ కుటుంబసభ్యులకు కూడా వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'ను కరీమ్ మొరానీ నిర్మించారు.
కనికా కపూర్ తో షాజా