ఆసీస్ జోరుకు స్పిన్నర్ పూనమ్ యాదవ్ బ్రేక్
- 27 రన్స్ తేడాతో ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- మ్యాచ్ పై పట్టు బిగించిన భారత్
- రసవత్తరంగా టి20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్
కానీ, అదే స్కోరు వద్ద మెగ్ లానింగ్ (5)ను ఔట్ చేసిన రాజేశ్వరి గైక్వాడ్ భారత్ కు బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి చకచకా వికెట్లు తీసిన పూనమ్ 14 ఓవర్లకు ఆసీస్ ను 82/6తో కష్టాల్లోకి నెట్టింది. హీలీతో పాటు రాచెల్ (6), ఎలైస్ పెర్రీ (0), జొనాసెన్ (2)ను ఔట్ చేసింది. ఆసీస్ విజయానికి చివరి ఆరు ఓవర్లలో 51 పరుగులు కావాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.