Vijay Sai Reddy: ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

  • తండ్రేమో ఆస్తి లక్ష కోట్లని ప్రకటించాడు
  • చిట్టినాయుడేమో అందరి కళ్లలో దుమ్ముకొడతాడు 
  • ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ 
vijaya sai reddy fires on chandra babu naidu

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి కుటుంబ ఆస్తుల వివ‌రాల‌ను నిన్న ఆయన కుమారుడు, టీడీపీ యువ‌నేత‌ నారా లోకేశ్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.  

'తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ' అని విమర్శలు గుప్పించారు.

More Telugu News