Budda Venkanna: జగన్ దేశానికే నష్టం కలిగిస్తుంటే మోదీ మందలించక దండ వేసి దన్నం పెడతారా?: బుద్ధా వెంకన్న

  • జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఫినాయిల్
  • రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి పోతోంది
  • 'జగ్లక్' పాలనలో రాష్ట్రం వెలిగిపోతోందంటూ వార్తలు రాయించుకున్నారు
budda venkanna criticises vijay sai reddy

'బాబు సీఎంగా లేని ఆంధ్ర రాష్ట్రం నాశనమై పోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడు. సీఎం జగన్ గారు రాష్ట్ర సమస్యల గురించి గంటన్నర సేపు ప్రధాని మోదీ గారితో సమావేశమైతే మందలించాడని రాశారు' అంటూ ఓ మీడియా అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఫినాయిల్. జగన్ గారి చెత్త ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి పోతున్నా 9 నెలల జగ్లక్ పాలనలో రాష్ట్రం వెలిగిపోతుంది అంటూ బ్లాక్ పేపర్ లో వార్తలు రాయించుకొని సంబరపడుతున్నారు' అని విమర్శించారు.

'తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికే కాక దేశానికే నష్టం కలిగిస్తుంటే ప్రధాని మందలించక దండ వేసి దన్నం పెడతారా ఫినాయిల్ గారు? 9 నెలల్లో ఏమి సాధించారని 'మోదీ గారు ప్రశంసలతో ముంచెత్తారు' అని మీ బ్లాక్ పేపర్ లో రాయించారు? సిగ్గుగా లేదా??' అని ప్రశ్నించారు.

More Telugu News