నేను ఏం మాట్లాడినా వేరే విషయాలు తెరపైకి తెస్తున్నారు: గంటా శ్రీనివాసరావు
- విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతించా
- అమరావతి రైతులకు కూడా న్యాయం చేయాలి
- న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటా
విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని గంటా చెప్పారు. తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని... సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. అమరావతి రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అమరావతికి మద్దతివ్వాలనే పార్టీ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.