తెలుగు మీడియం విద్యార్థులకు శుభవార్త.. జేఈఈ మెయిన్స్ ఇక తెలుగులో!

  • సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం
  • 2021 నుంచి అమలు
  • తెలుగుతోపాటు మరిన్ని ప్రాంతీయ భాషల్లో..
తెలుగు మీడియం విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్‌డీ) శుభవార్త చెప్పింది. ఇకపై జేఈఈ మెయిన్స్‌ను తెలుగులో నిర్వహించేందుకు ఎంహెచ్ఆర్‌డీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి ఆదేశాలు జారీ చేసింది.  2021లో నిర్వహించే పరీక్షల నుంచి ఈ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయనుంది.  

ప్రస్తుతం ఇంగిష్, హిందీ భాషల్లోనే జేఈఈ మెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళం, ఉర్దూ భాషల్లోనూ నిర్వహించనున్నారు.
Go Back to Shorts
JEE mains
Telugu
students
Exams

More Telugu News