ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు: మంత్రి పువ్వాడ స్పష్టీకరణ
- విలీనం గురించి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పలేదని వివరణ
- సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మంత్రి
- విపక్షాలను ప్రజలు ఈసడించుకుంటున్నారని వ్యాఖ్యలు
తాము చర్చలకు సానుకూలంగా ఉన్నా, కార్మిక సంఘాల నేతలే చర్చల నుంచి వైదొలగి వెళ్లిపోయారని పువ్వాడ ఆరోపించారు. తమపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో పసలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, 2018లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఓసారి ప్రతిపక్షాలు గుర్తెరగాలని హితవు పలికారు.