మహారాష్ట్రలో వర్షాలు... తెలంగాణ, ఏపీకి కొత్త సమస్య!
- 'వాయు' ప్రభావంతో భారీ వర్షాలు
- గోదావరికి వరద నీరు వచ్చే అవకాశం
- కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల వద్ద అధికారుల అప్రమత్తం
- భారీ యంత్రాలను తొలగించాలని నిర్ణయం
ప్రాజెక్టు పనులకు ఏ విధమైన నష్టం కలుగకుండా నదీ ప్రవాహాన్ని సహజ సిద్ధంగా వెళ్లేలా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉప్పొంగే గోదావరి ఎలా వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులను వరద ముప్పు నుంచి కాపాడేందుకు ఇండో - కెనడియన్ సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. వరద పెరిగితే పోలవరం వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, రక్షిత చర్యలు చేపట్టేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు కాళేశ్వరంలో సైతం పనులను తాత్కాలికంగా ఆపేసి, యంత్ర సామగ్రిని తరలించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.