మధ్యవర్తిత్వమే మార్గం... అయోధ్య కేసును తేల్చేందుకు ముగ్గురితో కమిటీ వేసిన సుప్రీం!

  • అయోధ్య కేసులో మధ్యవర్తిత్వమే మేలు
  • కమిటీలో ఖలీపుల్లా, రవిశంకర్, శ్రీరాం పంచ్
  • నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రామజన్మభూమి, అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కార మార్గం కనుగొనడం సులభమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అన్ని వర్గాలూ ఓ నిర్ణయానికి వచ్చి, సమస్య సమసిపోవాలంటే, మధ్యవర్తుల నియామకమే మేలైనదని భావిస్తున్నామని ఈ ఉదయం వ్యాఖ్యానించిన అత్యున్నత ధర్మాసనం, ముగ్గురితో కూడిన కమిటీని నియమించింది.

ఈ ప్యానల్ లో జస్టిస్ ఖలీపుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచ్ లు ఉంటారని సుప్రీం పేర్కొంది. మరో నాలుగు వారాల్లో అందరు పిటిషనర్లు, వాద ప్రతివాదులతో చర్చలు జరిపి తమ నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కొద్దిసేపటి క్రితం సూచించింది. కాగా, అయోధ్యలోని వివాదాస్పద 2.7 ఎకరాల భూమి తమదంటే తమదని హిందూ, ముస్లిం సంఘాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Ayodhya
Supreme Court
Ramjanmabhoomi
Mediation
Arbitration

More Telugu News