kerala: శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి

  • అయ్యప్పను జ్యోతి రూపంలో దర్శించుకున్న భక్తులు
  • దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • ‘అయ్యప్ప’ నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శనంతో భక్తులు తన్మయం చెందారు. ఆలయ ప్రాంగణం ‘అయ్యప్ప’ నామస్మరణతో మారుమోగింది. మకరజ్యోతి దర్శనం అనంతరం అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వెళ్లారు. కాగా, మకరజ్యోతి దర్శనం నిమిత్తం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం పంపా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు.   
kerala
ayyappa
shabarimala
devotees
makara jyothy
ponnambalmed
pampa
travencore

More Telugu News