ఈ ఎన్నికల్లో ఓడిపోతారని సిద్ధరామయ్యకు ముందే తెలుసు.. నేను రేపు ఢిల్లీకి వెళుతున్నా: యడ్యూరప్ప

  • అందుకే సిద్ధరామయ్య దళితుడిని సీఎం చేస్తామని అన్నారు
  • రెండు వారాల ముందే ఆ ప్రకటనెందుకు చేయలేదు?
  • నేను రేపు మోదీని కలుస్తాను
కాంగ్రెస్‌ పార్టీ దళిత నేతను సీఎం చేయాలనుకుంటే తాను ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆ రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప... సిద్ధరామయ్య ఈ విషయాన్ని రెండు వారాల ముందే ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని సిద్ధరామయ్యకు తెలుసని, అందుకే ఇటువంటి ప్రకటన చేశారని అన్నారు. కాగా, తాను రేపు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని యడ్యూరప్ప ప్రకటించారు.       
Go Back to Shorts
siddaramaiah
yadyurappa
Congress
BJP
Karnataka

More Telugu News