నింగిలోకి నేడు జీఎస్ఎల్వీ.. సాయంత్రం 4:56 గంటలకు ప్రయోగం
- బుధవారమే ప్రారంభమైన కౌంట్ డౌన్
- కక్ష్యలోకి అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ ఉపగ్రహం
- ఈ ఏడాది పది ఉపగ్రహ ప్రయోగాలు
ప్రయోగం తర్వాత రాకెట్ 17 నిమిషాల 46 సెకండ్ల పాటు ప్రయాణించి, ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచిపెట్టనున్నట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం పది ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్టు తెలిపారు. కాగా, నేడు ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివన్ ఉపగ్రహ నమూనాను స్వామి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.