మణికట్టు స్పిన్నర్ గా మారిన రవిచంద్రన్ అశ్విన్!
- సంప్రదాయ బౌలింగ్ శైలిని అనుసరించిన అశ్విన్
- మణికట్టు బౌలింగ్ తో టీమిండియాలో రాణిస్తున్న చాహల్, కుల్దీప్
- బౌలింగ్ శైలి మార్చుకుని, మణికట్టు బౌలర్ గా మారిన అశ్విన్
మణికట్టుతో తొలిసారి బౌలింగ్ చేసిన అశ్విన్... గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 9 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో కూడా ఇదే శైలితో బౌలింగ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. దానికోసమే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు. కాగా, మణికట్టు మాయాజాలంతో చాహల్, కుల్దీప్ లు జట్టులో సుస్థిరస్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. వారికి పోటీగా అశ్విన్ తయారవుతున్నాడు.