మంగళగిరిలో నారా లోకేశ్ 7.30 గంటల నాన్ స్టాప్ 'పట్టా'భిషేకం

Nara Lokesh 730 hours non stop Patta distribution in Mangalagiri
  • మంగళగిరిలో 1331 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
  • 'మన ఇల్లు – మన లోకేశ్' కార్యక్రమానికి శ్రీకారం
  • సుమారు 7.30 గంటల పాటు నిలబడే పట్టాలు అందించిన మంత్రి లోకేశ్
  • లబ్ధిదారులకు పట్టాతో పాటు నూతన వస్త్రాలు బహూకరణ
మంగళగిరి నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం మంగళగిరిలో ఓ పండుగలా జరిగింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా తొలిరోజు 1331 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను అందజేశారు.

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పట్టాల పంపిణీ సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. లబ్ధిదారుల 'పట్టా'భిషేకం అనదగ్గ ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ దాదాపు ఏడున్నర గంటల పాటు నిలబడే ఉండడం విశేషం. ప్రతి లబ్ధిదారుడికి ఆయనే స్వయంగా పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.

పట్టా పత్రాలతో పాటు లబ్ధిదారులందరికీ నూతన వస్త్రాలను కూడా మంత్రి లోకేశ్ బహూకరించారు. సుదీర్ఘ సమయం పాటు ఒకేచోట నిలబడి ఓపికగా పట్టాలు పంపిణీ చేయడంపై కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, ప్రజలు ప్రశంసలు తెలిపారు. 
Advertisement
Nara Lokesh
Mangalagiri
Mana Illu Mana Lokesh
House Site Pattas Distribution
Andhra Pradesh IT Minister
CK Convention Center Mangalagiri

More Telugu News