ఏపీలో బీసీల ఉపాధికి కొత్త స్కీం.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయమే లక్ష్యం
- బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆదరణ 3.0 పథకమన్న మంత్రి సవిత
- ఈ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడి
- కులవృత్తుల వారికి ఆధునిక పనిముట్లు, నైపుణ్య శిక్షణ ఇస్తామన్న మంత్రి
బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ఇందుకోసం 'ఆదరణ 3.0' పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఈ పథకం అమలుపై ఆమె సమీక్ష నిర్వహించారు.
ఆదరణ 3.0 పథకానికి ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిందని మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం ద్వారా కుల వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు అందించి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదరణ 1, ఆదరణ 2 పథకాలను విజయవంతంగా అమలు చేశారని, ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆదరణ 3.0కు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు.
ఈ పథకంలో లబ్ధిదారులకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వ్యక్తిగతంగా లేదా గ్రూపులుగా యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ యూనిట్ల ద్వారా లబ్ధిదారులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం వచ్చేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదరణ ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
ఇప్పటికే అన్ని బీసీ కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో ఈ పథకంపై అభిప్రాయాలు సేకరించామని, యూనిట్ల మంజూరులో వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, పలువురు అధికారులు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.
ఆదరణ 3.0 పథకానికి ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిందని మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం ద్వారా కుల వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు అందించి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదరణ 1, ఆదరణ 2 పథకాలను విజయవంతంగా అమలు చేశారని, ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆదరణ 3.0కు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు.
ఈ పథకంలో లబ్ధిదారులకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వ్యక్తిగతంగా లేదా గ్రూపులుగా యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ యూనిట్ల ద్వారా లబ్ధిదారులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం వచ్చేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదరణ ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
ఇప్పటికే అన్ని బీసీ కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో ఈ పథకంపై అభిప్రాయాలు సేకరించామని, యూనిట్ల మంజూరులో వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, పలువురు అధికారులు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.