Used Cars: సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో కొత్త ట్రెండ్... చిన్న నగరాల వినియోగదారులదే హవా
దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల (యూజ్డ్ కార్) మార్కెట్ స్వరూపం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల చుట్టూ తిరిగిన ఈ వ్యాపారం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల వైపు మళ్లింది. కార్స్24 విడుదల చేసిన 'గేర్స్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ 2025' ప్రకారం, దేశంలోని మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో ద్వితీయ శ్రేణి నగరాల వాటా ఏకంగా 62 శాతానికి చేరగా, మెట్రో నగరాలు 38 శాతానికే పరిమితమయ్యాయి.
ఈ నివేదిక ప్రకారం, 2024లో 13.8 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ, 2025 నాటికి కేవలం 5.8 శాతానికి పడిపోయింది. హర్యానా వాటా కూడా 10.7 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గింది. మరోవైపు, కర్ణాటక (10 శాతం నుంచి 16 శాతానికి), గుజరాత్ (8.7 శాతం నుంచి 13.1 శాతానికి) రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేశాయి. మహారాష్ట్ర 20.1 శాతం వాటాతో అతిపెద్ద మార్కెట్గా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోగా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వాటాలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
ప్రాధాన్యతల్లో తేడాలు
మెట్రో నగర వాసులు సెకండ్ హ్యాండ్ కారును మెరుగైన వాహనానికి అప్గ్రేడ్ అయ్యేందుకు ఒక అవకాశంగా చూస్తుంటే, ద్వితీయ శ్రేణి నగరాల్లోని చాలా మందికి ఇదే మొదటి కారు. అందుకే వారు తక్కువ నిర్వహణ ఖర్చులు, అధిక ఇంధన సామర్థ్యం, మన్నిక వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా నెక్సాన్ రెండు ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతుండగా, మెట్రోల్లో మారుతి బాలెనో, హోండా సిటీ వంటి ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ఉంది. అదే సమయంలో, ద్వితీయ శ్రేణి నగరాల మార్కెట్లలో హ్యుండై గ్రాండ్ ఐ10, రెనాల్ట్ క్విడ్ వంటి బడ్జెట్ కార్లకు గిరాకీ ఎక్కువగా ఉంది.
ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నాణ్యమైన కార్లు అందుబాటులోకి రావడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలు ఈ మార్పునకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ కొత్త ట్రెండ్ భారత ఆటోమొబైల్ మార్కెట్కు మరింత స్థిరత్వాన్ని అందిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ నివేదిక ప్రకారం, 2024లో 13.8 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ, 2025 నాటికి కేవలం 5.8 శాతానికి పడిపోయింది. హర్యానా వాటా కూడా 10.7 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గింది. మరోవైపు, కర్ణాటక (10 శాతం నుంచి 16 శాతానికి), గుజరాత్ (8.7 శాతం నుంచి 13.1 శాతానికి) రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేశాయి. మహారాష్ట్ర 20.1 శాతం వాటాతో అతిపెద్ద మార్కెట్గా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోగా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వాటాలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
ప్రాధాన్యతల్లో తేడాలు
మెట్రో నగర వాసులు సెకండ్ హ్యాండ్ కారును మెరుగైన వాహనానికి అప్గ్రేడ్ అయ్యేందుకు ఒక అవకాశంగా చూస్తుంటే, ద్వితీయ శ్రేణి నగరాల్లోని చాలా మందికి ఇదే మొదటి కారు. అందుకే వారు తక్కువ నిర్వహణ ఖర్చులు, అధిక ఇంధన సామర్థ్యం, మన్నిక వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా నెక్సాన్ రెండు ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతుండగా, మెట్రోల్లో మారుతి బాలెనో, హోండా సిటీ వంటి ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ఉంది. అదే సమయంలో, ద్వితీయ శ్రేణి నగరాల మార్కెట్లలో హ్యుండై గ్రాండ్ ఐ10, రెనాల్ట్ క్విడ్ వంటి బడ్జెట్ కార్లకు గిరాకీ ఎక్కువగా ఉంది.
ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నాణ్యమైన కార్లు అందుబాటులోకి రావడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలు ఈ మార్పునకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ కొత్త ట్రెండ్ భారత ఆటోమొబైల్ మార్కెట్కు మరింత స్థిరత్వాన్ని అందిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.