IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్పై బీసీసీఐ కీలక అప్డేట్
- ఐపీఎల్ 2026 సీజన్పై బీసీసీఐ ప్రకటన
- ఈ నెల 12న తొలి 20 రోజుల షెడ్యూల్ విడుదల
- ఎన్నికల కారణంగా మిగతా షెడ్యూల్ తర్వాత వెల్లడి
- ఈ నెల 28 నుంచి మే 31 వరకు టోర్నమెంట్
- ఇప్పటికే ప్రాక్టీస్ క్యాంపులు ప్రారంభించిన ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్ను ఈ నెల 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. 19వ ఎడిషన్ ఐపీఎల్ ఈ నెల 28 నుంచి మే 31 వరకు జరగనుంది.
మొత్తం షెడ్యూల్ను ఒకేసారి ప్రకటించకపోవడానికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. "ప్రస్తుతానికి తొలి 20 రోజుల షెడ్యూల్ ప్రకటిస్తున్నాం. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్ను విడుదల చేస్తాం" అని సైకియా తెలిపారు.
షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కానప్పటికీ, పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ సన్నాహక శిబిరాలను ప్రారంభించి జోరు పెంచాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలో ఈ నెల 1 నుంచే నవలూర్లోని తమ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నవీ ముంబైలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది.
వీరితో పాటు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ కూడా తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లు నిర్వహిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఈ నెల 15 నుంచి జైపూర్లో, కోల్కతా నైట్ రైడర్స్ 18 నుంచి తమ క్యాంపులను ప్రారంభించనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటికే తమ సన్నాహక శిబిరాలను పూర్తి చేసుకున్నాయి.
మొత్తం షెడ్యూల్ను ఒకేసారి ప్రకటించకపోవడానికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. "ప్రస్తుతానికి తొలి 20 రోజుల షెడ్యూల్ ప్రకటిస్తున్నాం. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్ను విడుదల చేస్తాం" అని సైకియా తెలిపారు.
షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కానప్పటికీ, పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ సన్నాహక శిబిరాలను ప్రారంభించి జోరు పెంచాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలో ఈ నెల 1 నుంచే నవలూర్లోని తమ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నవీ ముంబైలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది.
వీరితో పాటు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ కూడా తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లు నిర్వహిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఈ నెల 15 నుంచి జైపూర్లో, కోల్కతా నైట్ రైడర్స్ 18 నుంచి తమ క్యాంపులను ప్రారంభించనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటికే తమ సన్నాహక శిబిరాలను పూర్తి చేసుకున్నాయి.