గూగుల్ వైజాగ్ ను ఎంచుకుంది... మరి మీ సంగతి ఏంటి?: సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
- ఏపీకి టెక్ పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
- యూఏఈలో పర్యటన
- 12 ప్రముఖ టెక్నాలజీ కంపెనీల సీఈఓలతో రౌండ్టేబుల్ సమావేశం
- రాష్ట్ర ప్రభుత్వ పురోగామి విధానాలను వివరించిన ముఖ్యమంత్రి
- విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం
జీ42ఏఐ సంస్థ ఇండియా సీఈఓ మనుకుమార్ జైన్ ఏర్పాటు చేసిన ఈ నెట్వర్కింగ్ లంచ్, రౌండ్టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పురోగామి విధానాలను, పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న వేగవంతమైన అనుమతుల గురించి సీఈఓలకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను, టెక్నాలజీ రంగంలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి తెలియజేశారు.
అనంతరం, త్వరలో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుపేరునా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే అవకాశాలను స్వయంగా పరిశీలించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
