Sandra Venkata Veeraiah: కేసీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

Sandra Venkata Veeraiah meets KCR
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సత్తుపల్లి మాజీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఈరోజు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సండ్ర ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా, సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి వంటి అంశాలు వీరి భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి సంబంధించిన పలు విషయాలపై సండ్ర.. కేసీఆర్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సమావేశం మర్యాదపూర్వకంగానే జరిగిందని, రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని సండ్ర వర్గీయులు చెబుతున్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. 
Go Back to Shorts
Sandra Venkata Veeraiah
KCR
BRS
Sattupalli
Telangana Politics
Former MLA
KCR Farmhouse
Political Developments
Telangana
Assembly Elections

More Telugu News